Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్‌తో చిరంజీవి 150వ సినిమా: మాటల మాంత్రికుడు కథ చెప్పేశాడట!

Webdunia
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయన సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆ మద్య రాంచరణ్ చిత్రం ‘మగధీర’ చిత్రంలో ఒక్క డ్యాన్స్ సీన్లో మాత్రం కనిపించి వెళ్లిపోయాడు. ఇక రాజకీయ రంగానికి కాస్త దూరంగా ఉంటూ ఇప్పుడు తన 150 వ చిత్రంపై దృష్టి పెట్టారు చిరంజీవి.
 
మొదట్లో పూరీ జగన్నాథ్ తో ‘ఆటోజానీ’ సినిమా తీస్తున్నట్లు ఈ సినిమా రాంచరణ్ నిర్మించనున్నట్లు ఆ తెగ వార్తలు వచ్చాయి. కానీ అది క్యాన్సల్ కావడంతో మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘కత్తి’ రిమేక్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కానీ మొన్నామద్య వచ్చిన ‘అఖిల్’ అపజయంతో చిరంజీవి మళ్లీ డైలమాలో పడ్డట్లు తెలిసింది. దీంతో వివివినాయక్‌ని కూడా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. 
 
ఇప్పుడు హిట్ సినిమాల దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ కోట్టేశాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో టాక్. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా చిరుకు కథ వినిపించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్-సమంతలకు ''అ...... ఆ '' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవి లేదా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది.

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments