Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి -2కి తర్వాత అమీజాక్సన్‌తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్!

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (13:03 IST)
బాహుబలి హిట్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాగా ఫేమస్ అయిపోయాడు. బాహుబలి సినిమాతో తన కెరీర్ గ్రాఫ్‌ను బాగా పెంచుకున్న ప్రభాస్.. బాహుబలి-2 షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి 2కి తర్వాత స్టార్ హీరో రెండు కొత్త సినిమాలపై సంతకాలు చేశాడు. వీటిల్లో ముందుగా రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ చిత్రాన్ని సెట్స్‌పై పెట్టె పనిలో ఉన్నాడు ప్రభాస్. రన్ రాజా రన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు సుజీత్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చేయడంతో ప్రభాస్ ఓకే చెప్పేశాడు. 
 
ఇక భారీ బడ్జెట్‌‍తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హీరోయిన్‌‌ను ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. సుజీత్-ప్రభాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. విక్రమ్ సరసన ఐ, తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్‌తో రోబో 2.0లో నటిస్తున్న అమీ జాక్సన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటించేందుకు సై అంటోంది. తెలుగులో చరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో రెండో కథానాయికగా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మెయిన్ హీరోయిన్ కానుందని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments