Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ బరిలో నిలుస్తున్న చిత్రాలేవో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:41 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈరోజు ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం విడుదలైంది. మరోవైపు అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల బడ్జెట్ ఒక్కొక్కటి 250 కోట్లకు పైమాటే. అందుకే ఈ చిత్రాలు సోలోగా విడుదలవుతున్నాయి. వీటికి పోటీగా వచ్చేందుకు ఏ దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు. 
 
వీటి వల్ల తీవ్రమైన పోటీ ఉంటుందనే కొంతమంది హీరోలు సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. సాహో చిత్రానికి, సైరా చిత్రానికి మధ్య గ్యాప్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్‌లీడర్' సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతుండగా, వరుణ్ తేజ నటించిన 'వాల్మీకి' చిత్రం కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత దీపావళికి ఏ చిత్రమూ విడుదల కావడం లేదు. 2020 సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', బన్నీ 'అల వైకుంఠపురంలో' విడుదల కానున్న నేపథ్యంలో చాలా చిత్రాలు క్రిస్మస్‌కి వచ్చి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
ర‌వితేజ న‌టిస్తున్న 'డిస్కోరాజా' చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానుంద‌ని ఇది వరకే ప్ర‌క‌టించారు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీష్మ' సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా విడుదల చేయనున్నట్లు ఇటీవ‌ల చిత్రబృందం ప్రకటించింది. 
 
క్రిస్మ‌స్ పండుగ‌కి మ‌రి కొన్ని చిత్రాలు కూడా సంద‌డి చేసేందుకు సిద్ధమ‌య్యాయి. శ‌ర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తమిళ చిత్రం '96' రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్‌కి విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడట‌. 
 
ఇక దర్శకుడు మారుతి, సాయిధ‌రమ్ తేజ కలయికలో రూపొందుతున్న 'ప్రతీరోజూ పండగే' చిత్రం కూడా క్రిస్మ‌స్‌కే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. వెంకీ, చైతూ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న వెంకీ మామ అనే మల్టీ స్టార‌ర్ చిత్రం కూడా క్రిస్మ‌స్ స‌మ‌యంలోనే రిలీజ్ కానుందని టాక్. ఈ లిస్ట్ చూస్తుంటే ఈ ఏడాది క్రిస్మ‌స్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ పోటీ ఉండేలా క‌నిపిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments