Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... చార్మీకి దడ పుడుతోందా? హైకోర్టును ఆశ్రయించిన నటి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (12:17 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే చార్మిని ఈ వారంలోనే విచారించనున్నారు. ఈ నేపధ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించారు.
 
డ్రగ్స్ కేసు విచారణ తీరు సరిగా లేదనీ, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం అభ్యంతరకరం అంటూ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 26న చార్మి సిట్ ఎదుట విచారణ ఎదుర్కోవలసి వుంది. ఈ నేపధ్యంలో చార్మీ పిటీషన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసు వ్యవహారం సెలబ్రిటీలకు దడ పుట్టించేదిగా వుంటుందనే టాక్ వినబడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉదయం మూడు ముళ్లు వేయించుకుంది.. రాత్రికి ప్రాణాలు తీసుకుంది.... నవ వధువు సూసైడ్

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే- జర్నీకి రెండు గంటలే

వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య

Galla Jaydev: దేవుడు దయ ఉంటే తిరిగి టీడీపీలో చేరుతాను: జయదేవ్ గల్లా

ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం.. డమ్మీ బాంబును గుర్తించిన భద్రతా సిబ్బంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments