Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దాసరి ప్రాణాలు తీసింది: రేలంగి

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. బరువు తగ్గేందుకు తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని రేలంగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ

Webdunia
శనివారం, 1 జులై 2017 (09:45 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. బరువు తగ్గేందుకు తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని రేలంగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చికిత్స చేసుకోకపోయి వుంటే దాసరి మరో పదేళ్లు జీవించి వుండేవారని రేలంగి అన్నారు.

యూట్యూబ్ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేలంగి మాట్లాడుతూ.. బరువు తగ్గించుకునే చికిత్సలో భాగంగా దాసరిగారు తొలుత జీర్ణాశయంలో బెలూన్ వేయించుకున్నారన్నారు. ఆపై ఆరేడు కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. అదే నమ్మకంతోనే రెండోసారి దీనిపై కూడా సర్జరీకి వెళ్లి..బెలూన్‌ వేయించుకోవడమే ఆయన ప్రాణం తీసిందని తెలిపారు. రెండోసారి సర్జరీకి వెళ్లడమే దాసరి చేసిన తప్పు అని రేలంగి పేర్కొన్నారు. 
 
దాసరికి రెండోసారి పొట్టలో బెలూన్ వేసేటప్పుడే లోపం తలెత్తితే వైద్యులు దానిని సవరించి ఇంటికి పంపించారని అన్నారు. మొదటిసారి చికిత్స తీసుకున్నప్పుడు ఆయన ఎక్కువ ద్రవాహారన్నే తీసుకున్నారని తెలిపారు.

కానీ, రెండోసారి బెలూన్ వేయించుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం నోటి ద్వారా సాధారణ ఆహారాన్ని తీసుకునేందుకు చికిత్స చేయించుకున్నారన్నారు. అదే ఆయన ప్రాణానికి ముప్పు తెచ్చిందని వెల్లడించారు. సర్జరీకి వెళ్లకుండా ద్రవాహారాన్నే ఆయన తీసుకుని ఉంటే మరో పదేళ్లు బతికేవారని రేలంగి వివరించారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments