Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు పృథ్వీపై వేధింపుల కేసు : మహిళ ఫిర్యాదుతో

''30 ఇయర్ ఇండస్ట్రీ'' డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ క‌మెడియ‌న్ పృథ్వీపై పోలీసు కేసు న‌మోదు చేశారు. పృథ్వీతనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కవిత అనే మహిళ బంజారా హిల్స్ పోలీసులను ఆ

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (08:51 IST)
''30 ఇయర్ ఇండస్ట్రీ'' డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ క‌మెడియ‌న్ పృథ్వీపై పోలీసు కేసు న‌మోదు చేశారు. పృథ్వీతనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కవిత అనే మహిళ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన కవిత(30) బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నటుడు పృథ్వీరాజ్ కార్యాలయంలో రిసెప్షనిస్టుగా చేరింది. అప్పటికే పెళ్లయిన కవిత భర్తకు విడాకులు ఇచ్చి పృథ్వీతో కొంతకాలం సహజీవనం చేశారు. తనను వివాహం చేసుకుని నాలుగేళ్లపాటు కాపురం చేసి నమ్మించి మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం బిజీ క‌మెడియ‌న్‌గా వెలుగొందుతున్నపృథ్వీ తనదైన శైలిలో డైలాగ్‌లు పలికిస్తాడు. ఖడ్గం చిత్రంలో ''30 ఇయర్స్ ఇండస్ట్రీ'' అంటూ ఆయన చెప్పిన మేనరిజం డైలాగ్ బాగా పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు పృథ్వీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments