Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (13:58 IST)
బిగ్ బాస్ 7 సీజన్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జరిగిన గొడవ కేసులో టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. యూసుఫ్ గూడకు చెందిన సుధాకర్, పవన్, సరూర్ నగర్‌కు చెందిన అవినాశ్ రెడ్డిలను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జరిగిన ధ్వంసం, దాడికి సంబంధించిన ఘటనలో రెండు కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
మరోవైపు, పల్లవి ప్రశాంత్‌కు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వరాదన్న షరతు విధించింది. బెయిల్‌పై బయట ఉన్న ప్రశాంత్ తన ఊరిలో ఉన్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments