కార్తీకేయ ఫేమ్ డైరక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించే సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను సెలక్ట్ చేసుకోనున్నాడు. మలయాళ ప్రేమమ్ సినిమాను రీమేక్ చేస్తున్న చందు.. పరిణీతి చోప్రా, మల్లు బ్యూటీ అనుపమ, వరుణ్ తేజ్ లోఫర్ హీరోయిన్ దిషా పటానీలను చైతు సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.
ముగ్గురు భామలతో ప్రేమాయణం కొనసాగించే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ముగ్గురు భామలతో చైతూ రొమాన్స్ అదిరిపోతుందని.. కథంతా కామెడీగా యూత్ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినీ యూనిట్ అంటోంది. మరి నాగ చైతన్య పరిణీతి చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్ సరసన తేలిపోకుండా తన నటనను వెలికితెస్తాడా? లేకుంటే ఏం చేస్తాడో? వేచి చూడాల్సిందే.