ధనుష్ ప్రభు సాల్మన్ల రైలు నేపథ్య చిత్రానికి తొడరి అనే పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అభిమానుల నుంచి కూడా కొత్త టైటిల్తోపాటు విడుదల చేసిన ఫస్ట్లుక్ స్టిల్స్ అదుర్స్ అంటూ భారీ స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఈ ఆడియో కార్యక్రమంలో ధనుష్, కీర్తి సురేష్ తదితర కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
లవ్ కమ్ థ్రిల్లింగ్ ట్రైన్ జర్నీ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్లో ధనుష్ ఒక స్టిల్లో, కదులుతున్న రైలు వెనక భాగాన వాకీ టాకీతో మాట్లాడుతూ టెన్షన్గా కనిపిస్తాడు. ధనుష్, కీర్తిసురేష్లు ఒక బోగీ నుంచి ఇంకో బోగీ మీదకు దూకేందుకు ప్రయత్నిస్తున్న మరో స్టిల్ ఈ చిత్రంపై ఆసక్తిని, అంచనాల్ని పెంచేశారు. ప్రభుసాల్మన్ ఈ సినిమా ఆడియోను విడుదల చేసిన నేపథ్యంలో పాటలకు మంచి క్రేజ్ వస్తుందని సినీ పండితులు అంటున్నారు.