Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే తీసుకునేది.. శ్రీదేవిపై నోరువిప్పిన బోనీకపూర్

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:28 IST)
2018లో అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూశారు. నటి మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన భార్య మరణానంతరం ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొన్నాళ్లపాటు మౌనం వీడారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు తన భార్య మరణం గురించి మాట్లాడారు.
 
24 ఫిబ్రవరి 2018 హిందీ సినిమా తన మొదటి సూపర్ స్టార్ శ్రీదేవిని శాశ్వతంగా కోల్పోయిన భయంకరమైన రోజు. దుబాయ్‌లో ఆమె ఆకస్మిక మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. హోటల్ బాత్‌రూమ్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందినట్లు సమాచారం. 
 
వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరోసారి స్పందించారు. తన భార్య సడెన్‌గా చనిపోవడంతో దుబాయ్ పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించారని తెలిపారు. దాదాపు 48 గంటల పాటు అన్ని రకాలుగా ప్రశ్నించి, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని తేలడంతోనే తనను వదిలిపెట్టారని చెప్పారు.
 
తన భార్య చనిపోవడానికి కారణం ఆమె ఆహార నియమాలేనని భావిస్తున్నట్లు బోనీ కపూర్ చెప్పారు. శరీరాకృతిని అందంగా ఉంచుకునేందుకు ఆమె కఠినమైన డైట్‌ను ఫాలో అయ్యేదని తెలిపారు. 
 
ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీ కపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 యేళ్ల జైలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments