Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళికి ఆచార్య‌కు సంబంధం చాలా వుందంటున్న చిరంజీవి

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:14 IST)
Rajamouli, Chiranjeevi
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి, ఆచార్య సినిమాకు చాలా సంబంధం వుంది. రాజ‌మౌళి స‌హ‌క‌రించ‌క‌పోతే ఆచార్య అనుకున్న‌టైంకు పూర్తి అయ్యేది కాదంటూ మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లే ఆచార్య ప్ర‌మోష‌న్‌లో భాగంగా వీడియో ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. 
అంత‌కుముందు ఆర్‌.ఆర్‌.ఆర్‌.సినిమా క‌మిట్‌మెంట్‌తో రామ్ చ‌ర‌ణ్ డేట్స్ లేవు. కానీ రామ్‌చ‌ర‌ణ్ ఆచార్య‌లో న‌టించాలి. ఇందుకు తానే రాజ‌మౌళిని క‌లిసి కాస్త డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకోమ‌ని అడిగాను. అందుకు ఆయ‌న సహృద‌యంతో స‌హ‌క‌రించారు. ఇందుకు కార‌ణం కూడా వుంది. న‌న్ను, చ‌ర‌ణ్‌ను వెండితెర‌పై చూడాల‌నేది త‌ల్లికోరిక బ‌లంగా వుండ‌డంతో అది సాధ్య‌ప‌డింద‌ని.. ఇంట‌ర్వ్యూలో కొరటాల‌తో చిరంజీవి చెప్పారు.
 
అందుకే ఆచార్య ప్రీరిలీజ్ వేడుక‌కు ముఖ్య అతిథిగా రాజ‌మౌళి హాజ‌రుకానున్నార‌ని తెలుస్తోంది. యూసఫ్ గుడా పోలీస్ గ్రౌండ్‌లో వేడుక ఈనెల 23న ఘనంగా జ‌రగబోతొంది. శ్రేయాస్ ఈవెంట్స్ నిర్వహించే ఈ ఈవెంట్‌లో రాజ‌మౌళి, కొరటాల, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేతో పాటు ప‌లువురు సినీప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments