Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ర్కారువారు పాట‌లో మ‌హేష్ డైలాగ్‌లు మైన‌స్ అయ్య‌యా!

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (19:16 IST)
మహేష్ బాబు న‌టించిన‌ సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌లో ప‌లికిన కొన్ని డైలాగ్‌ల‌కు ఇప్పుడు మైన‌స్‌గా మారింద‌నే నెటిజ‌న్లు తెలియజేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌రోజు పాజిటివ్ టాక్‌తో అంద‌రూ పొగిడినా రానురాను అది స‌న్న‌గిల్లింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉంది, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీకి జ‌నాలు తెగ చూసేస్తార‌ని రిలీజ్‌కుముందు మ‌హేష్ ప‌లికిన ప‌లుకుల‌ను అభిమానులే ప‌ట్టించుకోవ‌డంలేదు. అందుకు కార‌ణం ఈ సినిమాకు రాజ‌కీయ‌రంగు పుల‌మ‌డ‌మే.
 
కృష్ణ కుటుంబం వై.ఎస్‌.ఆర్‌.కు అనుకూలం. అది అంద‌రికీ తెలిసిందే. కానీ సినిమాలో రాజ‌కీయ డైలాగ్‌లు ప‌డ‌డంవ‌ల్ల సర్కారు వారి పాట సినిమాకు మైన‌స్ అయింద‌ని నెటిజ‌న్లు విశ్లేషిస్తున్నారు. హీరోహీరోయిన్ క‌లిసే ఓ సంద‌ర్భంలో `నేను విన్నాను. నేనున్నాను.` అంటూ వై.ఎస్‌. ప‌లికిన ప‌లుకుల‌ను మ‌హేష్‌బాబు ప‌లికాడు. దాంతో ఇది మ‌హేష్ చెప్ప‌కుండా వుండాల్సింద‌ని సోష‌ల్‌మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అందువ‌ల్లే వైసి.పి. పార్టీ మిన‌హా మిగిలిన పార్టీల‌కు చెందిన వారెవ‌రూ ఈ సినిమాను చూడ‌డంలేద‌నీ, అందుకే పెద్ద స‌క్సెస్ కాలేక‌పోతుంద‌ని తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం వివరణ

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments