Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పేట' వర్సెస్ 'విశ్వాసం' - కత్తులతో ఫ్యాన్స్ కొట్లాట

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి రెండు మూడు రోజుల ముందుగానే వచ్చినట్టుగా ఉంది. తమతమ అభిమాన హీరోల చిత్రాలు ఒకేరోజు విడదలయ్యాయి. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. రజినీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు జనవరి పదో తేదీ గురువారం విడులయ్యాయి. 
 
దీంతో ఈ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద సందడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు చిత్రాలు పక్కపక్క థియేటర్లలో ఆడుతుంటడంతో ఇరు హీరోల అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చెన్నై నగరంలోన రోహిణి థియేటర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు కత్తులతో పోట్లాడుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. 
 
అలాగే, మదురైలోని ఓ థియేటర్‌లో ఇరు హీరోల అభిమానుల మధ్య తొలుత వాగ్వాదంతో ప్రారంభమైన ఘర్షణ, ఆపై కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అభిమానులను చెదరగొట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments