Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయకుడు మనో ఇద్దరు కుమారులపై కేసు నమోదు

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (11:39 IST)
మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడిచేసి పరారీలో ఉన్న సినీ నేపథ్యం గాయకుడు మనో ఇద్దరు కుమారులపై చెన్నై వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పరారీలో ఉన్న ఇద్దరు పోలీసు కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్‌కు చెందిన 16 యేళ్ల బాలుడు వలసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడెమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారుడు సహా ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్, 16 ఏళ్ల బాలుడితో గొడవపడి దాడి చేసినట్లు తెలిసింది. 
 
గాయపడిన కృపాకరన్ కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతని ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు గాయకుడు మనో కుమారులు రఫిక్, సాహీర్, వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి, దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల వరద!!

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments