Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయకుడు మనో ఇద్దరు కుమారులపై కేసు నమోదు

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (11:39 IST)
మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడిచేసి పరారీలో ఉన్న సినీ నేపథ్యం గాయకుడు మనో ఇద్దరు కుమారులపై చెన్నై వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పరారీలో ఉన్న ఇద్దరు పోలీసు కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్‌కు చెందిన 16 యేళ్ల బాలుడు వలసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడెమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారుడు సహా ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్, 16 ఏళ్ల బాలుడితో గొడవపడి దాడి చేసినట్లు తెలిసింది. 
 
గాయపడిన కృపాకరన్ కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతని ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు గాయకుడు మనో కుమారులు రఫిక్, సాహీర్, వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి, దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments