ఎంజీఆర్ టైటిల్.. చిన్నమ్మకు రానా ఝలక్.. రెస్టారెంట్లో వందమంది ఎమ్మెల్యేలను కూర్చోబెడితే...?

బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు, నేనే మంత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ''నాన్ ఆనైఇట్టాల్'' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో నేనే రాజు

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (15:13 IST)
బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు, నేనే మంత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ''నాన్ ఆనైఇట్టాల్'' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. తమిళంలో ట్రైలర్ విడుదలైంది. తేజ దర్శకత్వంలో రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. 
 
ఇటీవల విడుదల చేసిన తమిళ టీజర్‌లోని ఓ డైలాగ్‌ పట్ల తమిళ రాజకీయ నాయకుల మధ్య ఆసక్తిని పెంచుతుంది. వంది మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్‌లో కూర్చోబెడితే నేను కూడా సీఎంనే.. అంటూ రానా చెప్పిన డైలాగ్ తమిళ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది. పైగా ఈ సినిమాకు తమిళనాడు మాజీ సీఎం ఎంజీయార్‌ సినిమాలోని హిట్‌ సాంగ్‌ అయిన ‘నాన్‌ అనైయిట్టాల్‌’ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. దీంతో తమిళ జనాలకు ఆసక్తి పెరిగింది. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత తమిళనాడులో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
అన్నాడీఎంకే రెబెల్ పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బయటికొచ్చి.. చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్, శశికళ వర్గంగా మారింది. ఆపై బలపరీక్ష కోసం చిన్నమ్మ రెస్టారెంట్‌లో ఎమ్మెల్యేలను నిర్భంధించి పళనిసామిని సీఎం చేసిన సంగతి తెలిసిందే. ఇలా రెస్టారెంట్లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎడప్పాడి పళనిసామిని సీఎం చేయడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. తాజాగా రానా కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చేలా తన సినిమాలో డైలాగ్ పేల్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments