Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు 'కరోనా' సాయం ప్రకటించిన తమిళ హీరో

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (15:54 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు తమిళ హీరో విజయ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ.5 లక్షలు చొప్పున మొత్తం 10 లక్షల ఆర్థిక సాయాన్ని హీరో విజయ్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పంపించనున్నారు. 
 
అలాగే, పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలతో పాటు తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చేరికి రూ.5 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలు చొప్పున విజయం ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెల్సిందే.
 
'కరోనా’ వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటానికి విజయ్ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
అలాగే తెలుగు హీరో అల్లు అర్జున్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కేరళ రాష్ట్రానికి కూడా ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెల్సిందే. తన మాతృభాషతో పాటు.. ఇతర రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు ఆర్థిక సాయం ప్రకటించిన హీరోలు వీరిద్దరే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments