Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌ను పగబట్టిన కరోనా వైరస్ : మరో కమెడియన్ మృతి

Webdunia
గురువారం, 6 మే 2021 (11:30 IST)
తమిళ చిత్ర పరిశ్రమను కరోనా వైరస్‌ పగబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హాస్యనటుడు కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆయన పేరు పాండు. వయసు 74 యేళ్లు. 
 
క‌రోనాతో కొద్ది రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న గురువారం తుది శ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే పాండు భార్య‌కు కూడా క‌రోనా సోక‌గా, ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
పాండు మృతి ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. 1970లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేసిన పాండు ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
మరోవైపు, సీనియర్‌ గాయకుడు, నటుడు టీకేఎస్‌ నటరాజన్‌(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయ‌న శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్‌ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈయన అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments