Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌ను పగబట్టిన కరోనా వైరస్ : మరో కమెడియన్ మృతి

Webdunia
గురువారం, 6 మే 2021 (11:30 IST)
తమిళ చిత్ర పరిశ్రమను కరోనా వైరస్‌ పగబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హాస్యనటుడు కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆయన పేరు పాండు. వయసు 74 యేళ్లు. 
 
క‌రోనాతో కొద్ది రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న గురువారం తుది శ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే పాండు భార్య‌కు కూడా క‌రోనా సోక‌గా, ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
పాండు మృతి ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. 1970లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేసిన పాండు ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
మరోవైపు, సీనియర్‌ గాయకుడు, నటుడు టీకేఎస్‌ నటరాజన్‌(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయ‌న శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్‌ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈయన అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments