Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ వర్సెస్ శరత్ కుమార్: మాటల యుద్ధంతో పాటు క్రిమినల్ కేసులు..

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (11:33 IST)
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికలు మాటల యుద్ధంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవడానికి కూడా వేదికగా మారాయి. తమిళ చిత్రసీమలో పెను వివాదానికి తెరతీసిన నడిగర్ సంఘం ఎన్నికల్లో భాగంగా తారల మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ జరుగుతోంది. 
 
ప్రస్తుతం నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరోమారు ఆ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో శరత్ కుమార్‌పై పలు ఆరోపణలు చేసిన యువ హీరో విశాల్ ఆయనకు పోటీగా నడిగర్ అధ్యక్ష బరిలో దిగేందుకు రెడీ అయ్యాడు. దీనిపై ఇరు వర్గాల మధ్య ఘాటు విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు సైతం తూటాల్లా పేలుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపై విశాల్ చేసిన ఆరోపణలన్నింటినీ పూసగుచ్చిన శరత్ కుమార్ యువ హీరోపై శుక్రవారం ఎగ్మూర్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న విశాల్ కూడా ఘాటుగానే స్పందించాడు. శరత్ కుమార్‌పై తాను కూడా కేసు నమోదు చేస్తానని విశాల్ ప్రకటించాడు.

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments