దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (21:32 IST)
దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు, సినీ హీరో, దర్శకుడు మనోజ్ భారతీరాజా హఠాన్మరణం చెందారు. ఆయనకు వయసు 48 యేళ్లు. కొన్ని నెలల క్రితం ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో చెన్నై, చెట్‌పట్‌లోని ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
తన తండ్రి భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్‌మహల్ చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే, విరుమన్, మానాడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలను పోషించారు. 'మార్గళి తింగల్' అనే చిత్రానికి దర్శకత్వం వహించి తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేశారు. మనోజ్ మృతిపట్ల తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments