Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మా' పేద కళాకారులకు ప్రభుత్వం నుంచి పింఛన్ ఇప్పిస్తా... తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా' అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల శివాజీ రాజా బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ పార్టీలో రాజేంద్రప్రసాద్‌తో కలిసి సభ్యులందరు ఏకగ్రీవంగా 'మ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (22:11 IST)
'మా' అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల శివాజీ రాజా బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ పార్టీలో రాజేంద్రప్రసాద్‌తో కలిసి సభ్యులందరు ఏకగ్రీవంగా 'మా' అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లను ప్రతిపాదించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిసి విషెస్ అందుకున్నారు. 
 
మంత్రి తలసాని కలిసిన శివాజీ రాజా, నరేష్‌లు 'మా' పేద కళకారులకు పింఛన్, ఇళ్ల నిర్మించాలని కోరారు. దీనికి స్పందిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ " 'మా' అధ్యక్షులుగా శివాజీరాజా, జనరల్ సెక్రటీగా నరేష్‌లు ఉండాలనే నిర్ణయాన్ని దర్శకరత్న దాసరి నారాయాణరావు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మేము అంగీకరించామని శివాజీ రాజా, నరేష్‌లు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. శివాజీ రాజా, నరేష్‌లు అడిగిన అంశాలన్నింటికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేస్తుంది. పేద కళకారులకు పింఛన్, 'మా' అసోసియేయన్ సొంత భవనం ఏర్పాటు చేసుకోవడానికి మా ప్రభుత్వం సహాయసహాకారలను అందిస్తుందిన్నారు. చిత్ర పరిశ్రమకి సంబంధించి ఎలాంటి సహాయాన్ని చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. త్వరలోనే 'మా' సభ్యులందర్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడిస్తా" అన్నారు.
 
దాసరిని పరామర్శించిన శివాజీ రాజా, నరేష్...
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న డా. దాసరి నారాయాణరావు గారిని శుక్రవారం ఉదయం నటులు శివాజీ రాజా, నరేష్‌లు పరామర్శించారు. గతంలో ఆయన చెప్పిన విధంగానే 'మా' అసోసియేషన్ అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటీగా నరేష్‌లు మొట్టమొదటిసారిగా ఆయనే ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

తర్వాతి కథనం
Show comments