Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్నా.. తాప్సీ

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (15:48 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు - మంచు మనోజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్, వీరా, మొగుడు వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ అమ్మడుకి ఆశించిన గుర్తింపురాలేదు. ఫలితంగా ఆమె తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. 
 
అక్కడ మంచి కథాంశంతో ఉన్న చిత్రాల్లో నటిస్తూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయ‌ణంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. 
 
తాప్సీ త‌న సోదరి షగున్‌తో కలిసి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని రాజకుమారుడి గురించి కూడా లీక్ చేసింది. తాను ఓ వ్యక్తితో ప్రేమించినట్టు, అయితే, తాను ప్రేమించే వ్యక్తి ఓ నటుడని తెలిపింది. క్రికెటర్ మాత్రం కాదని తెలిపింది. పైగా, అస‌లు భారతీయుడే కాదు అని చెప్పి అంద‌రికి షాకిచ్చింది. 
 
'ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్న తర్వాతే నాకు నా రాజకుమారుడు దొరికాడు' అని తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. అయితే 'నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కాకుండా మాత్రం పిల్లల్ని కనను. అలాగని నా పెళ్లి ఆడంబరాలతో ఉండకూడదు. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య స‌ర‌దాగా జ‌ర‌గాలి' అని ఆమె స్ప‌ష్టం చేసింది.
 
కాగా, తాప్సీ చెబుతున్న వ్యక్తి డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనా అని పలువురు అంటున్నారు. కానీ, తాప్సీ మాత్రం సినీ నటుడని చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments