''సైరా''లో నయనతార నటన అదుర్స్.. చిరంజీవి, తమన్నా యాక్టింగ్‌కు జనాలు ఫిదా..

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (15:24 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా  సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో నయనతార చిరంజీవి సరసన నటించింది. ఈ సినిమాలో నయన లుక్ అదిరిందని.. ఆయన నటన అద్భుతమని.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. తాజాగా సైరాలో ఆమె నటనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
 
ఇదిలా ఉంటే.. భీమవరం మెగా అభిమానులపై రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రత్యేక ట్వీట్ చేశారు. మామయ్య చిరంజీవి హీరోగా, భర్త రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన 'సైరా' చిత్రం విడుదల సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.
 
భీమవరంలో చిరు అభిమానులు 250 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు అర కిలోమీటర్ వరకు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్‌ను ఉపాసన తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.
 
మరోవైపు సైరా సినిమాను చూసిన వారు చిరంజీవి నటనకు ముగ్ధులవుతున్నారు. సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. సినిమాలోని డైలాగులు రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నాల నటన కూడా అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments