Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత‌గా సుశ్మిత కొణిద‌ల మ‌రో సినిమా

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (19:23 IST)
Sushmita
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత మ‌రోసారి నిర్మాత‌గా మార‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆమెకు సినీరంగంలో ప‌లు రంగాల‌పై ప‌ట్టు సాధించారు. ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. జై చిరంజీవ సినిమాకు తొలిసారిగా ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ప‌నిచేశారు. ఇక ఆ త‌ర్వాత చిరంజీవి న‌టించిన `ఖైదీనెం. 150`, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆమె నిర్మాత‌గా శ్రీ‌కాంత్‌తో `షూట్ అవుట్ ఆలేరు` అనే వెబ్ సిరీస్ నిర్మించారు.
 
తాజా స‌మాచారం మేర‌కు సుశ్మిత ఓ సినిమా నిర్మాణం చేయ‌బోతోంది. ఆమె స్వంత బేన‌ర్ అయిన గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత‌గా మారుతుంది. త‌మిళ సినిమా `ఎట్టుతొట్ట‌క‌ళ్లం` అనే సినిమాను తెలుగులో తీయ‌బోతుంది. ఇందులో `ఏక్ మినీ క‌థ‌` హీరో సంతోష్ శోభ‌న్ న‌టించ‌నున్నాడు. ఆయ‌న ప‌క్క‌న త‌మిళ సినిమా `96` ఫేమ్ గౌరీ న‌టించ‌నుంది. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు శ్రీ‌గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments