Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతోనే...

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (12:45 IST)
ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈ పోస్టు మార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. 
 
మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం సుశాంత్ మరణం సినీ, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు. 
 
నేడు అంత్యక్రియలు 
భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. అతని అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరుగనున్నాయి. అంతేకాకుండా, సుశాంత్ మృతదేహాని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో నెగెటివ్ అని తేలింది. దీంతో సుశాంత్ కుటుంబ సభ్యులో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నా నుంచి ముంబైకు ఇప్పటికే చేరుకున్నారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సుశాంత్... ముంబై బాంద్రాలోని తన నివాసంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, తన కుమారుడు సుశాంత్ మరణ వార్త తెలుసుకున్న తండ్రి కృష్ణకుమార్ సింగ్ కుప్పకూలిపోయారు. ఈయన పాట్నాలో నివసిస్తున్నారు. ఆయనకు ఈ మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయారు. సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పాట్నా నివాసంలో సంరక్షకురాలిగా వ్యవహరిస్తున్న లక్ష్మీ దేవి వెల్లడించారు. 
 
సుశాంత్ అక్క చండీగఢ్ నుంచి పాట్నా బయల్దేరారని తెలిపారు. సుశాంత్ స్వస్థలం బీహార్ లోని పూర్ణియా జిల్లా మాల్దిహా ప్రాంతం. సినిమాలపై ఆసక్తితో ముంబయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ డిప్రెషన్‌కు‌లోనై బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కానీ, సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments