సుశాంత్ ఆత్మహత్య.. రియా అక్కడే వున్నదట.. డ్రాప్ కూడా చేశాడట!

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (12:39 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాత రియా డ్రగ్స్ బాగోతం బయటికి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఈ కోణంలో విచారణ చేపట్టింది. సుశాంత్ మరణానికి ముందు అతని ఇంట్లో పార్టీ జరిగినట్టు ఓ జాతీయ మీడియా సంచలన విషయాల్ని బయటపెట్టింది.
 
లాక్‌డౌన్ సమయంలో సుశాంత్‌తో కలిసి రియా వుందన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. జూన్ 8న తాను సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయానని గతంలో తెలిపింది. కానీ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రియా జూన్ 13న అంటే సుశాంత్ మృతి చెందిన రోజు వరకు అక్కడే వుందని, సుశాంత్ స్వయంగా రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అర్థరాత్రి ఆమెని డ్రాప్ చేశాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో రియా కావాలనే అబద్ధం చెబుతోందని తేలిపోయింది. దీంతో సీబీఐ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
అంతే కాకుండా సుశంత్ మృతి కేసులో సిద్ధార్ధ్ పితానీని కూడా సీబీఐ మరోసారి విచారణకు పిలవబోతోందట. సుశాంత్ మృతి చెందిన రోజు సిద్ధార్ధ్ పితాని ఇంట్లోనే వున్నారట. ఆ కారణంగా అతన్ని ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి మరో సారి అతన్ని విచారించబోతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం