Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ఆత్మహత్య.. రియా అక్కడే వున్నదట.. డ్రాప్ కూడా చేశాడట!

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (12:39 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాత రియా డ్రగ్స్ బాగోతం బయటికి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఈ కోణంలో విచారణ చేపట్టింది. సుశాంత్ మరణానికి ముందు అతని ఇంట్లో పార్టీ జరిగినట్టు ఓ జాతీయ మీడియా సంచలన విషయాల్ని బయటపెట్టింది.
 
లాక్‌డౌన్ సమయంలో సుశాంత్‌తో కలిసి రియా వుందన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. జూన్ 8న తాను సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయానని గతంలో తెలిపింది. కానీ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రియా జూన్ 13న అంటే సుశాంత్ మృతి చెందిన రోజు వరకు అక్కడే వుందని, సుశాంత్ స్వయంగా రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అర్థరాత్రి ఆమెని డ్రాప్ చేశాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో రియా కావాలనే అబద్ధం చెబుతోందని తేలిపోయింది. దీంతో సీబీఐ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
అంతే కాకుండా సుశంత్ మృతి కేసులో సిద్ధార్ధ్ పితానీని కూడా సీబీఐ మరోసారి విచారణకు పిలవబోతోందట. సుశాంత్ మృతి చెందిన రోజు సిద్ధార్ధ్ పితాని ఇంట్లోనే వున్నారట. ఆ కారణంగా అతన్ని ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి మరో సారి అతన్ని విచారించబోతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం