Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం తలుపుతట్టిన మోహన్ బాబు... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (14:25 IST)
తమ ఇంటి గొడవల సమయంలో ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన కేసులో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు ఈ పిటీషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో నటుడు మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించకుండా, గురువారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 
 
కొద్ది సేపటి తరువాత మళ్లీ కోర్టుకు వచ్చిన ముకుల్ రోహత్గీ... మోహన్ బాబు బెయిల్ పిటీషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారం జరుగనుంది. కాగా, ఈ దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments