Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ఒత్తిళ్లు.. అవకాశాలు లేమి.. అందుకే ఆ డైరెక్టర్ సూసైడ్ అటెంప్ట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనైన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ డైరెక్టర్ పేరు రాజసింహా. ఈయన స

Webdunia
గురువారం, 17 మే 2018 (14:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనైన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ డైరెక్టర్ పేరు రాజసింహా. ఈయన సందీప్ కిషన్ హీరోగా వచ్చిన "ఒక్క అమ్మాయి తప్ప" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
అంతేకాకుండా, 'రుద్ర‌మ‌దేవి', 'అన‌గ‌న‌గా ఓ ధీరుడు' వంటి సినిమాల‌కు ర‌చ‌యిత‌గా కూడా పని చేశారు. ముఖ్యంగా, 'రుద్ర‌మ‌దేవి' సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు తెలంగాణ యాస‌లో మాట‌లు రాసింది రాజ‌సింహే. 
 
ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రం పరాజయంపాలైంది. అనంతరం ఆయనకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో డిప్రెష‌న్‌కు గురైన ఆయ‌న ముంబైలోని తన నివాసంలోనే ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఆర్థిక ఒత్తిళ్లతో పాటు.. సినీ అవకాశాలు లేనికారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments