ఎన్టీఆర్ - చరణ్‌కి పోటీ ఇవ్వాలనే ఆమెను ఎంపిక చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (13:57 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సంచలన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు, చరణ్‌ అభిమానులే కాకుండా.. సినీ ప్రియులందరూ ఎదురు చూస్తున్నారు. 
 
ఇప్పుడు హైదరాబాద్‍‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను స్టార్ట్ చేసారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే... ఈ ఎపిసోడ్ తెరపై ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తుంది. ప్రత్యేకంగా అలియాను "ఆర్ఆర్ఆర్" హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక ఓ సీక్రెట్ ఉంది. అది ఏంటంటే... "ఆర్ఆర్ఆర్‌"లో ఎన్టీఆర్, చరణ్‌లాంటి అద్భుతమైన నటులు ఉన్నారు. అలాంటి వారికి పోటీ ఇచ్చి నిలబడాలంటే ఎక్స్‌ట్రీమ్లి టాలెంటెడ్ అయి ఉండాలి. ఆ టాలెంట్ అలియా భట్‌కి ఉంది. 
 
అందుకే ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాను అని రాజమౌళి అసలు విషయం బయటపెట్టారు. త్వరలోనే అలియా భట్ షూటింగ్‌లో జాయిన్ కానుందని సమాచారం. 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్ధాయిలో ఉన్నాయి. అయితే... ఎన్ని అంచనాలు ఉన్నప్పటికీ... 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు. మరి.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments