'ఆర్ఆర్ఆర్' గురించి మొదటిసారి మాట్లాడిన జక్కన్న

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:19 IST)
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరో భారీ బడ్జెట్, భారీ మల్టీస్టారర్ చిత్రం "ఆర్ఆర్ఆర్" ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన రోజుల్లో కొద్ది రోజులు రామ్ చరణ్ పైన, కొద్ది రోజులు ఎన్‌టీఆర్ పైన కొన్ని సన్నివేసాలను షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ కనిపించే సన్నివేసాల చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది.
 
ఇప్పటికే పాత్రకు తగ్గట్లు కనిపించడం కోసం తగిన శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లిన ఎన్‌టీఆర్‌ను తిరిగి రావలసిందిగా రాజమౌళి కబురు పంపడం జరిగింది. ఎన్‌టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే వచ్చే గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. హీరోలిద్దరూ కనిపించే సన్నివేసాలను పూర్తి చేసే వరకు ఈ షెడ్యూల్ విరామం లేకుండా సాగుతుందని సమాచారం.
 
ఇలావుండగా, ఈ సినిమా గురించి ఇప్పటి వరకు బయట ఎక్కడా మాట్లాడని రాజమౌళి మొదటిసారి హార్వర్డ్ యూనివర్శిటీలో 'ఇండియా ఎట్ యాన్ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ థీమ్'లో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా సినిమా అని, బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదు అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్లు ఎవరో వెల్లడించకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments