Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న కుమారుడు ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నాడట...?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:16 IST)
రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతున్నాడన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై కార్తికేయ చిత్రాలను నిర్మిస్తాడు. సంస్థ తొలి ప్రయత్నంగా ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మించబోతోంది. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్‌లు రాయబోతున్నాడు. ఈ సినిమాకి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇది అతనికి తొలి చిత్రం. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా అదే టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రాబోతోంది. దాని పేరు కూడా ఆకాశవాణి. కాకపోతే దాని పూర్తి టైటిల్ 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం'. సతీష్ బత్తుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మర్రిమాకల మల్లికార్జున నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల పోస్టర్ విడుదల చేశారు. వీటి వలన జనాలలో కన్ఫ్యూజన్ రావచ్చు. ఇద్దరూ ఒకే టైటిల్ ఎందుకు పెట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' టీజర్ పోస్టర్‌ని చూసినట్లయితే, నీడలో ఒక వ్యక్తి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. 'నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటో మీకు సభాముఖంగా చెప్పబోతున్నాను' అనే క్యాప్షన్‌ని కూడా పెట్టారు. మరి అతని ప్రాబ్లమ్ ఏంటో తెలియాలంటే టీజర్ చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments