Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న కుమారుడు ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నాడట...?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:16 IST)
రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతున్నాడన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై కార్తికేయ చిత్రాలను నిర్మిస్తాడు. సంస్థ తొలి ప్రయత్నంగా ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మించబోతోంది. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్‌లు రాయబోతున్నాడు. ఈ సినిమాకి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇది అతనికి తొలి చిత్రం. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా అదే టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రాబోతోంది. దాని పేరు కూడా ఆకాశవాణి. కాకపోతే దాని పూర్తి టైటిల్ 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం'. సతీష్ బత్తుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మర్రిమాకల మల్లికార్జున నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల పోస్టర్ విడుదల చేశారు. వీటి వలన జనాలలో కన్ఫ్యూజన్ రావచ్చు. ఇద్దరూ ఒకే టైటిల్ ఎందుకు పెట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' టీజర్ పోస్టర్‌ని చూసినట్లయితే, నీడలో ఒక వ్యక్తి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. 'నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటో మీకు సభాముఖంగా చెప్పబోతున్నాను' అనే క్యాప్షన్‌ని కూడా పెట్టారు. మరి అతని ప్రాబ్లమ్ ఏంటో తెలియాలంటే టీజర్ చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments