నా కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన ధృవతార : జూనియర్ ఎన్టీఆర్

సినీ వినీలాకాశం నుంచి మరో ధృవతార నేలరాలింది. అతిలోకసుందరిగా జనం మదిలో నిలిచిపోయిన అందాల తార అస్తమించింది. బాల నటిగా, కథానాయికగా ఎన్నో మరపురాని పాత్రలు పోషించి, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న నటి శ్

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:23 IST)
సినీ వినీలాకాశం నుంచి మరో ధృవతార నేలరాలింది. అతిలోకసుందరిగా జనం మదిలో నిలిచిపోయిన అందాల తార అస్తమించింది. బాల నటిగా, కథానాయికగా ఎన్నో మరపురాని పాత్రలు పోషించి, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న నటి శ్రీదేవి శనివారం రాత్రి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. 
 
తన మేనల్లుడి వివాహా వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమె.. అక్కడే తన తుది శ్వాస విడిచారు. ఆమె మరణించారు అనే విషయం.. సినీ ప్రముఖులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. అలాంటి అందాల తారను అభిమానించే అభిమానుల్లో టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 
 
తన తాత నందమూరి తారక రామారావుతో ఎన్నో మరపురాని సినిమాల్లో నటించిన శ్రీదేవి అంటే తారక్‌కు ఎనలేని అభిమానం. ఈ విషయాన్ని తారక్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు కూడా. ఏ ఇంటర్వ్యూ అయినా, మరే సందర్భంలో అయినా తన అభిమాన తార శ్రీదేవి అని చెప్పేవాడు తారక్. కుదిరితే ఆమెతో ఒక్క పాటలో అయినా చేయాలని పరితపించేవాడు. 
 
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'నాకు నచ్చిన హీరోయిన్ శ్రీదేవి.. అంతే... ఆమెకు వీళ్లెవరూ సాటిరారు. ఒక మాట. ఒక భార్య. ఒక బాణం అంటారు కదా. అలా నా మైండ్‌లో ఆమె ఫిక్స్‌ అయిపోయిందంతే. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ. ఆమె అంటే నాకు పిచ్చి.. కానీ, ఆమె మనతో చేయరండి. ఎక్కడో ఓ చోట ట్రై చేయాలి. ఏదో ఒక సందర్భంలో కనీసం ఒక సాంగైనా... నా శక్తి మేరకు ట్రై చేస్తాను. కుదిరితే ఓకే' అంటూ ఎన్టీఆర్ తన మనసులోని మాటను వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments