Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సముద్రంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం?

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామే

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (13:25 IST)
ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామేశ్వరంలో శనివారం కలిపినట్టు వార్తలు వచ్చాయి. 
 
దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అస్థికలను రామేశ్వరం తీరంలో ఉన్న బంగాళాఖాతంలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలచుకుని విలపించారు. 
 
అయితే, ఈ వార్తలను అనేక మంది కొట్టిపారేస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వచ్చిన బోనీ కపూర్ కుటుంబం.. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న శ్రీదేవికి సొంతమైన ఫామ్‌హౌస్‌లో బసచేశారు. 
 
ఈ ఇంటి వెనుక భాగంలో ఉన్న బంగాళా ఖాతంలోనే ఈ అస్థికలను నిమజ్జనం చేశారని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే. వారు నిమజ్జనం చేసిన సమయంలో తీసిన ఫోటో రామేశ్వరంలో తీసినది కాదనీ, శ్రీదేవి నివాసం వెనుకభాగంలో ఉన్న సముద్రం వద్ద తీసిందనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments