Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు కలుపనున్న బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు రామేశ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (20:16 IST)
అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు రామేశ్వరం వెళ్తారని సమాచారం. రామేశ్వరంలో అస్థికలు నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి ముంబై చేరుకుంటారని తెలిసింది. 
 
కాగా దుబాయ్‌కి మేనల్లుడి పెళ్లి కోసం వెళ్లి.. బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు ఊపిరాడక ఫిబ్రవరి 24న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఫిబ్రవరి 28వ తేదీన ముంబైలో జరిగాయి. ఇదిలా ఉంటే.. శ్రీదేవి మృతి చెందడాన్ని ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో అందరూ షాక్‌లో వున్నారు. 
 
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ శ్రీదేవి అభిమాని రైలులో ''చాందినీ'' లోని ''తేరే మేరే హోనోథో పర్ ..'' పాటను వాయిస్తూ తన అభిమాన నటికి నివాళులర్పించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments