హమ్మయ్య.. ప్రాణగండం నుంచి తప్పించుకున్న ఎస్పీబీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (16:06 IST)
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్‌గా గుర్తింపు పొందిన ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ఆగస్టు నెలలో కరోనా వైరస్ బారినపడిన ఆయన.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆయన కుమారుడు ఎస్.పి.చరణ్ తెలిపారు.
 
కాగా, కరోనా వైరస్ బారిన ఎస్బీబీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ముఖ్యంగా, ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాసపీల్చడం కష్టంగా మారిపోయింది. దీంతో ఆయనకు వెంటిలేటర్‌తో పాటు ఎక్మో పరికరాన్ని అమర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఓ దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఎస్పీ బాలును ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఆపై ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు. దీనిపై ఎస్పీ చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.
 
త్వరలోనే తన తండ్రికి ఎక్మో, వెంటిలేటర్ తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్, ఎక్మో వ్యవస్థల సాయంతోనే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఫిజియోథెరపీ కొనసాగుతోందని ట్విట్టరులో వివరించారు. 
 
ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా, తన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

తిరుమల నెయ్యి కల్తీ కేసు.. వైవి సుబ్బారెడ్డి సెక్రటరీ చిన్న అప్పన్న వద్ద సిట్ విచారణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments