Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి స్నేహపై సంచలన కామెంట్స్ చేసిన బైల్వాన్ రంగనాథన్

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (10:49 IST)
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు సర్వసాధారణం. అయితే స్నేహపై కోలీవుడ్ జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ షో లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సీనియర్ నటి స్నేహ ఒకరు. తొలివలపు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. 
 
ముంబైలో పుట్టిన స్నేహ దుబాయ్‌లో పెరిగింది. స్నేహ మొదటిసారిగా 2000 సంవత్సరంలో ఇంగనే ఒరు నీలపక్షి అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 2001లో, గోపీచంద్ మొదటి సినిమా వలపుతో స్నేహ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. వాటిలో సంక్రాంతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 
 
వెంకీ, రాధాగోపాలం సినిమాలు కూడా స్నేహకు ప్లస్సయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తోంది. ఇంతలో స్నేహ కోలీవుడ్ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
 
అయితే తాజాగా సినీ జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ స్నేహపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. “ప్రసన్న కంటే ముందు నటి స్నేహ ఒక ప్రముఖ నిర్మాతతో ప్రేమలో పడింది. ఆయన మరెవరో కాదు నిర్మాత నాగ్ రవి. వీరి ప్రేమ ఒక దశకు చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వజ్రాల ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు’’ అని బైల్వాన్ రంగనాథన్ తెలిపారు. 
 
"నిశ్చితార్థం తర్వాత, స్నేహకు తన ప్రియుడు, నిర్మాత నాగ్ రవిపై అనుమానం వచ్చింది. ఆ తర్వాత నిర్మాతతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఇక పెళ్లి ఇష్టం లేని స్నేహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడింది. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు" అని రంగనాథన్ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments