Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మొహం ఎపుడైనా టిక్కెట్ కొని సినిమా చూశాడా? శివాజీ రాజా ఫైర్ (వీడియో)

ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావులపై తెలుగు సినీ ప్రముఖులు ఆగ్రహావేశాలు వ్యక

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (15:12 IST)
ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావులపై తెలుగు సినీ ప్రముఖులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ మండిపడుతున్నారు. ఇలాంటి వారిలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. 
 
తాజాగా శివాజీరాజా మాట్లాడుతూ, విజయవాడలో ఉండే రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తిది ఎపుడైనా టిక్కెట్ కొని సినిమా చూసిన మొహమేనా అంటూ మండిపడ్డారు. దేవుడితో సమానమైన ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ నీచమైన కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై రాజకీయ నాయకుల్లోనే స్పష్టత లేదన్నారు. 
 
ఒక రోజు ప్రత్యేక హోదా కావాలంటారు.. మరో రోజు డబ్బులు కావాలంటారు. ఇలా మీలోనే ఓ క్లారిటీ లేదనీ, ఇక మాకేం క్లారిటీ ఉంటుందని నిలదీశారు. పైగా, మా ప్రొఫెషన్ అది కాదనీ, ఏదో ఓ మంచి సినిమా తీయడమని శివాజీ రాజా అన్నారు. ఆయన పూర్తి ప్రసంగానికి చెందిన వీడియోను మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments