Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ సునీత రెండో పెళ్లి.. ఇంటర్వ్యూల్లో కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకంటే? (video)

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (20:26 IST)
టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సింగర్ సునీత రెండో పెళ్లి మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక తొలి భర్త బాధలు భరించలేక విడాకులు ఇచ్చేసింది. సింగిల్ మదర్‌గా ఉంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. కాగా ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు అంటూ అవసరం అంటూ ఆమె బిడ్డలు ఆమె కోసం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ఇచ్చి రెండో వివాహం చేశారు.
 
మనకు తెలిసిందే సింగర్ సునీత రామ్ జంటపై చాలా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్న సునితను అడిగాగ్గా.." మీ మీద చాలా ట్రోస్ వస్తున్నాయి కదా .. మీరు రెండో పెళ్లి గురించి అయితే చాలా విమర్శలు ఉన్నాయి ..చాలా ట్రోలింగ్ కూడా జరుగుతుంది ..వాటి గురించి మీరు ఏమంటారు ..ఎప్పుడైనా బాధపడ్డారా..? అని ప్రశ్నించగా" సునీత మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. 

\


sunitha
 
ఆమె మాట్లాడుతూ .."మీరందరూ అంటూ ఉంటారు కదా చిత్ర గారి తర్వాత సునీత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిందని.. చాలామందిని ఎంటర్ టైన్ చేసింది అని.. మరి అలాంటి మంచి విషయాలు గురించి మీరు నన్ను పొగిడినప్పుడు రామ్‌ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఎందుకు తిడుతున్నారు. 
 
నాపై ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. అసలు నా పర్సనల్ లైఫ్‌తో మీకు ఏంటి సంబంధం. నా పర్సనల్ జీవితంపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు . ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో గొంతు లేపుతున్నారు. 


సంస్కారవంతుల లక్షణం ఏంటో తెలుసా.. ఒక మనిషి ఒక మాటను అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి.. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడితే మంచిది" అంటూ కన్నీరు పెట్టుకునేసింది. దీంతో ప్రస్తుతం సునీత మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments