Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ మంగ్లీ బోనాల పాట వివాదాస్పదం.. ఏమైందంటే?

Webdunia
శనివారం, 17 జులై 2021 (17:05 IST)
సింగర్ మంగ్లీ తాజాగా పాడిన ఓ బోనాల పాట వివాదాస్పదమవుతోంది. జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..` అంటూ సాగే పాట విడుదలయింది. 
 
ఈ పాటకు పాటకు ఇప్పటికే 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. లిరిక్స్ రామస్వామి రాయగా, రాకేష్ వెంటాపురం మ్యూజిక్ అందించారు. మంగ్లీ ఆ పాటను పాడడంతో పాటు స్క్రీన్‌పై కూడా కనిపించారు. ఢీ ఫేమ్ పండు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాట లిరిక్స్‌పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
బోనాల పండగ వేళ అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడాలి గానీ.. విమర్శిస్తూ పాడడం ఏంటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. పాటలో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని.వాటిని వెంటనే మార్చాలని, క్షమాపణ కూడా చెప్పాలని ఆర్‌జే కిరణ్ విమర్శించారు. 
 
అంతేకాదు పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మంగ్లి స్థానికతను కూడా కొందరు ప్రశ్నిస్తోన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మంగ్లీకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుసంటూ ప్రశిస్తున్నారు.
 
అయితే కొందరు మాత్రం సింగర్ మంగ్లీకి మద్దతుగా నిలిచారు. అందులో ఆమె తప్పేం లేదని అంటున్నారు. లిరిక్స్ ఆమె రాయదని చెప్పారు. అలాగే ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments