తెలుగు, తమిళభాషల్లో ఒకే హీరో నటించడం మామూలే. అయితే మార్కెట్ రీత్యా.. తెలుగులో ఒక హీరో, తమిళంలో పేరున్న హీరోలను పెట్టడం కొన్ని చిత్రాలకే దక్కుతుంది. ఇప్పుడు ఆ కోవలోనే దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ ప్రయోగం చేస్తున్నాడు. తెలుగులో నాగ చైతన్యతో తమిళంలో శింబుతో సినిమా చేస్తున్నాడు. తెలుగులో 'సాహసం శ్వాసగా సాగిపో' పేరు పెట్టారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు కోసం అభిమానులంతా ఎప్పట్నుంచో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఇందులో పాటలు వచ్చేనెలలో విడుదల కానున్నాయి. జూలైలో సినిమాను విడుదల చేయనున్నారు.
అయితే నాగచైతన్య, శింబుల నటనలో ఎవరు బాగా మెప్పిస్తారనేందుకు దర్శకుడు మాత్రం... ఇద్దరివీ సెపరేట్ స్టైల్స్. ఏమాయ చేశావోలో.. నాగచైతన్యకు తగినట్లుగా వున్నట్లే ఇందులో ఆయన క్యారెక్టర్ వుంటుంది. ఇక శింబు గురించి చెప్పక్కర్లేదు. అమాయకం, చురుకుదనం కలగలిపిన పాత్రల్లో బాగా మెప్పిస్తాడని వెల్లడిస్తున్నారు. కాగా, రెండు భాషల్లోనూ మంజిమా మోహన్ హీరోయిన్గా నటించారు.