ప్రియుడితో బ్రేకప్‌ వార్తలకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టిన శృతిహాసన్

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (09:38 IST)
హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. మరోవైపు, తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తలకెక్కుతున్నారు. అయితే, గత కొన్ని రోజుల క్రితం ఆమె చేసిన ఓ ట్వీట్ పెను సంచలనమైంది. 
 
తన ఒంటరితనాన్ని ఫీలవుతూ నాతో నేనే ఉంటాను. అదే నాకు సంతోషం. నా విలువైన సమయాన్ని ప్రేమిస్తాను. ఒంటరితనాన్ని ప్రేమిస్తాను అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఆమె తన ప్రియుడు సంతాను హజారికాతో బ్రేకప్ గుర్తించి వస్తున్న వార్తలు నిజమేనని ప్రతి ఒక్కరూ భావించారు. ఈ వార్తలు వైరల్ కావడంతో శృతిహాసన్ తనదైనశైలిలో స్పందించారు. 
 
కేవలం ఒకే ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు. తన ప్రియుడుతో కలిసి అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఎల్లపుడూ కోరుకునేది ఇదే అంటూ క్యాప్షన్ జోడించింది. కాగా, ప్రస్తుతం శృతిహాసన్ ఇద్దరు పెద్ద హీరోలతో నటించారు. అందులో ఒకరు చిరంజీవి. ఈయనతో "వాల్తేరు వీరయ్య" చిత్రంలో నటించారు. రెండో హీరో బాలకృష్ణ. ఈయనతో కలిసి "వీరసింహా రెడ్డి" చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదలకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments