Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమాన సేవలు రోజురోజుకూ దిగిపోతున్నాయి : శృతిహాసన్

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (17:14 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమాన సంస్థపై సినీ హీరోయిన్ శృతిహాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇండిగో విమాన సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యమైందని, ఈ చర్య అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని చెప్పిన ఆమె... కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
 
తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్ పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ తెలిపారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు.
 
ఇక శృతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శృతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది. అయితే, ఇండిగో సమాధానాన్ని పలువురు నెటిజన్లు విమర్శించారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని దుయ్యబట్టారు. ఉన్న విషయం చెబితే ప్రయాణికులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments