Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంశీ పైడిపల్లికి మరో షాక్, ఇంతకీ ఏమైంది?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (18:00 IST)
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబుతోనే సినిమా చేయాలనుకున్నారు. మహేష్‌ కూడా వంశీతో మరో సినిమా చేస్తానన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీని దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. అయితే... సరైన స్టోరీ సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఆ తర్వాత నుంచి వంశీ పైడిపల్లి కథ రెడీ చేస్తూనే ఉన్నారు కానీ.. సరైన ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు.
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో సినిమా చేయాలనుకున్నారు. కథ రెడీ చేసారు.. రీసెంట్‌గా చరణ్‌కి నెరేషన్ ఇచ్చారు. అయితే... కథ విని చరణ్ ఓకే చెప్పలేదట. దీంతో వంశీ పైడిపల్లికి మరో షాక్ తగిలింది. స్టార్ హీరోల్లో ఒక్క చరణ్ మాత్రమే ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమాని కన్ఫర్మ్ చేయలేదు. మిగిలిన హీరోలందరూ ప్రాజెక్ట్ ఓకే చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
 
అందుచేత ఇప్పుడు వంశీ ముందున్న తక్షణ కర్తవ్యం చరణ్‌ కోసం మరో కథను రెడీ చేయడమే. అయితే.. చరణ్‌ దగ్గర గట్టి పోటీ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుములతో చరణ్ తదుపరి చిత్రం విషయమై చర్చిస్తున్నట్టు సమాచారం. మరి.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments