Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాహిద్‌తో కాటేజీ షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల: కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై విరుచుకుపడింది. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రంగూన్’ షూటింగ్ సందర్భంగా షాహిద్ కపూ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (17:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై విరుచుకుపడింది. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రంగూన్’ షూటింగ్ సందర్భంగా షాహిద్ కపూర్‌తో కాటేజీని షేర్ చేసుకోవడంపై కంగనా రనౌత్ స్పందించింది. షాహిద్ కపూర్, కంగనా రనౌత్‌ల మధ్య రంగూన్ సినిమా షూటింగ్ సందర్భంగా కోల్డ్‌వార్ జరిగినట్టుగా బిటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కంగనాతో గొడవల్లేవని షాహిద్ చెప్తుండగానే.. కంగనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ సందర్భంగా షాహిద్‌తో ఒకే కాటేజిలో కలిసుండడమే తనకు ఎదురైన అతిపెద్ద సమస్యగా భావిస్తున్నట్టు పేర్కొంది. కాటేజ్ సౌకర్యాలు కూడా సరిగాలేని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌కి వెళ్లామని.. అక్కడ కాటేజీలు లేక.. షాహిద్‌తో తాను కాటేజీ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంగనా చెప్పింది. 
 
షాహిద్‌కు స్పీకర్స్ దద్దరిల్లిపోయేలా పెద్ద పెద్ద సౌండ్స్‌తో చిత్రమైన పాటలు వినడం అలవాటు. ప్రతిరోజు ఆ హిప్ హాప్ మ్యూజిక్‌కి అదిరిపడుతూ లేవాల్సివచ్చేది. లేచిన వెంటనే రెడీ ఏదోఒకటి తిని బయటపడేదాని అంటూ కంగనా చెప్పుకొచ్చింది. మొత్తానికి షాహిద్‌తో కాటేజి షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల అంటూ కంగనా కామెంట్ ఇచ్చేసింది. మరి దీనిపై షాహిద్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ 1.o నుంచి ప్రజలు కోలుకోలేకపోతున్నారు, ఇంక జగన్2.o చూపిస్తారా?: నారా లోకేష్

మహిళా ఖైదీలను చూడగానే కామం తన్నుకొచ్చింది.. కాంగో జైలులో తిరుగుబాటుదారుల అకృత్యాలు (Video)

ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అసెంబ్లీకి వెళ్లడంలేదు.. జగన్

పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు

అమెరికా నుంచి అహ్మదాబాద్‌‌కు భారతీయులు.. ట్రంప్ అంత పని చేశారా? చేతులు కట్టేసి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments