Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్‌ రెడ్డి'కి నేనెప్పటికీ రుణపడి ఉంటాను.. షాలినీ పాండే

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (13:33 IST)
Arjun Reddy
ఆగస్టు 25 తన జీవితంలోనే కీలకమైన రోజంటూ.. నటి షాలినీ పాండే తెలిపింది. అంతేగాకుండా.. అర్జున్‌ రెడ్డి కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పింది. దాదాపు ఐదేళ్ల క్రితం ఇదే రోజున తాను నటిగా వెండితెరకు పరిచయమైన 'అర్జున్‌ రెడ్డి' విడుదలై ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించిందని గుర్తు చేసింది. 
 
ఆ సినిమాలో తాను పోషించిన ప్రీతి పాత్రకు మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలినేనని షాలినీ పాండే వెల్లడించింది. ఈ సందర్భంగా 'అర్జున్‌ రెడ్డి'కి తానెప్పటికీ రుణపడి ఉంటా. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ధన్యవాదాలు. తొలి చిత్రం ఎలా చేస్తానోనని కంగారు పడుతోన్న తనలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడని కితాబిచ్చింది. 
 
"లైగర్‌'.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలాగే నీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని షాలినీ రాసుకొచ్చింది. సందీప్‌ రెడ్డి వంగా - విజయ్‌ దేవర కొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్‌ చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. షాలినీ పాండే కథానాయిక. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments