కోమాలో నటుడు నర్సింగ్ యాదవ్ - భార్య ఏమన్నారంటే...

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (09:12 IST)
సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. డయాలసిస్ పేషెంట్ అయిన నర్సింగ్ యాదవ్‌కు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పాటు.. బ్రెయిన్‌లో రక్తంగడ్డకట్టడంతో ఆయన కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న యశోదా ఆస్పత్రిలో చేర్చి వెంటిలేటర్‌ను అమర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
డయాలసిస్ పేషెంట్ అయిన నర్సింగ్ యాదవ్ ఏప్రిల్ 9వ తేదీన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. ఇది గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయు వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు కూడా స్పందిస్తారు. 
 
ఇదే అంశంపై ఆయన భార్య చిత్రా యాదవ్ స్పందిస్తూ, అనారోగ్యానికి గురైన తన భర్తకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. డయాలసిస్ పేషెంట్ కావడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయాలని వైద్యులు చెప్పారని తెలిపారు. 
 
అంతేకానీ, తన భర్త బాత్రూమ్‌లో జారిపడ్డారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చారు. కాగా, ఆయనకు గురువారం డయాలసిస్ చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments