Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమాలో నటుడు నర్సింగ్ యాదవ్ - భార్య ఏమన్నారంటే...

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (09:12 IST)
సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. డయాలసిస్ పేషెంట్ అయిన నర్సింగ్ యాదవ్‌కు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పాటు.. బ్రెయిన్‌లో రక్తంగడ్డకట్టడంతో ఆయన కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న యశోదా ఆస్పత్రిలో చేర్చి వెంటిలేటర్‌ను అమర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
డయాలసిస్ పేషెంట్ అయిన నర్సింగ్ యాదవ్ ఏప్రిల్ 9వ తేదీన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. ఇది గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయు వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు కూడా స్పందిస్తారు. 
 
ఇదే అంశంపై ఆయన భార్య చిత్రా యాదవ్ స్పందిస్తూ, అనారోగ్యానికి గురైన తన భర్తకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. డయాలసిస్ పేషెంట్ కావడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయాలని వైద్యులు చెప్పారని తెలిపారు. 
 
అంతేకానీ, తన భర్త బాత్రూమ్‌లో జారిపడ్డారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చారు. కాగా, ఆయనకు గురువారం డయాలసిస్ చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments