Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి మరణంపై నిజాలు దాచాయంటున్న మహిళ... సీబీఐ చార్జిషీటు

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (09:55 IST)
అందాల నటి శ్రీదేవి మృతిపై భారత్, యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచాయని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటి అనే మహిళ ఆరోపించింది. పైగా, శ్రీదేవి మృతిపై ఆమె సొంతంగా దర్యాప్తు కూడా జరిపి, భారత్, యూఏఈలు నిజాలు దాచాయంటూ నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కేంద్రం ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. విచారణ జరిపి చార్జిషీటును తయారు చేసి దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఈ పరిణామంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా శ్రీదేవి మరణంపై దీప్తి నకిలీ పత్రాలను సృష్టించింది. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్ చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై దీప్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ - భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు. 
 
దీంతో కేంద్రం ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చాందినీ షా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీదేవి 2018లో దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవికి భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 2,200 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌- సుమీ బోరా బావ అరెస్ట్

రీల్స్ చేస్తూ.. రైలు వస్తున్నది గమనించలేదు.. భార్యాభర్తలు, కుమారుడు మృతి

గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. 18 మంది అరెస్ట్.. గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు...

నేను అధికారంలోకి వస్తే కూటమి నాయకుల్ని ఇదే జైలులో వేస్తా.. జగన్ (video)

ఐఎంజీ సంస్థకు భూములు.. పిటిషన్లను కొట్టేసిన కోర్టు.. బాబుకు ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

రాత్రి పూట ఒక్క యాలుక్కాయను తింటే చాలు ఆ సమస్యలన్నీ ఔట్

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments