Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమీర్ ఖాన్‌పై దేశద్రోహం కేసు.. హాజరుకావాలంటూ కాన్పూర్ కోర్టు సమన్లు

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (09:10 IST)
మత అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్‌పై దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కేసులు నమోదవుతున్నాయి. ఇందులోభాగంగా ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కోర్టులో ఈ కేసు నమోదైంది. దీంతో డిసెంబర్ ఒకటో తేదీన నేరుగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆయనకు కోర్టు సమన్లు జారీచేసింది. 
 
మరోవైపు ఆమీర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. కొంతమంది ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తుంటే మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐతే తనపై వస్తున్న విమర్శలకు ఆమీర్ ఖాన్ స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఒక భారతీయుడిగా గర్వపడుతున్నట్టు చెప్పారు. తనకు, తన భార్యకు దేశం విడిచి వెళ్లాలన్న ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. 
 
తన ఇంటర్వ్యూ చూడని వారే తనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. తన దేశ భక్తికి ఎవరి కితాబు అక్కర్లేదని ఆయన దెప్పిపొడిచారు. తాను అచ్చమైన భారతీయుడినని, దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని ఆమీర్ మరోసారి చెప్పారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments