Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టప్ప ఇంట్లో విషాదం: సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కన్నుమూత

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2023 (22:16 IST)
ప్రముఖ నటుడు బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కళింగరాయర్ (94) వృద్ధాప్యం కారణంగా మరణించారు. నాదాంబాళ్ తన తల్లి మరణ వార్త తెలియగానే సత్యరాజ్ షూటింగ్ ఆపేసి కోయంబత్తూర్ చేరుకున్నారు.  
 
వయోభారం కారణంగా అనారోగ్యం పాలైన ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తన తల్లి నాదాంబాళ్‌కి తాను నటించిన చిత్రాలు అంటే చాలా ఇష్టం అని గతంలో తెలిపారు. తాను నటించిన ప్రతి చిత్రాన్ని ఆమె చూస్తారట. నాదాంబాళ్‌కి సత్యరాజ్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 
 
సత్యరాజ్ తల్లి మృతి పట్ల హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా నాదాంబాళ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments