Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఖుషీలో టీమ్

Webdunia
సోమవారం, 9 మే 2022 (17:28 IST)
సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్  చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, ఎయిర్ కండిషన్, సాధారణ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 
 
ఈ నెల 12 నుంచి 7 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. మరోవైపు ఈనెల 12 నుంచి 18 వరకు ఉదయం 7 నుంచి అర్థరాత్రి 1 వరకు 5వ షో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఇకపోతే.. సర్కారు వారి పాట ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే "కళావతి" సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. 
 
దీంతో పాటు "మ మ మషేషా" సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది. ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. పరుశురామ్ దర్మకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments