Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథలుగా మారిన బాలికలకు అండగా సంపూర్ణేష్ బాబు.. చదివించేందుకు సిద్ధం!

Webdunia
గురువారం, 1 జులై 2021 (23:32 IST)
Sampoornesh
హీరో సంపూర్ణేష్‌ బాబు అనాథ బాలికలకు అండగా నిలవడం ద్వారా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిని చదివించేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాలు చేసే హీరో అయినప్పటికీ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు తోచిన సాయం చేస్తుంటారు సంపూ.
 
తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహచారి దంపతులు అప్పు బాధలతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు దిక్కులేని వారిగా మారారు. ఈ వార్త చూసి సంపూర్ణేష్‌ చలించిపోయారు. తక్షణమే వారి వివరాలు తెలుసుకుని రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలిపారు. 'దుబ్బాకలో నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నా హృదయం కలిచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డలకు నేనై, సాయి రాజేశ్‌ రూ. 25వేల? ఆర్థిక సాయం అందించాం. వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని వారికి మాట ఇచ్చాం'' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సంపూ.. 'బజారు రౌడీ, 'క్యాలీఫ్లవర్‌', 'పుడింగి నంబర్‌ వన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments